ఐసీసీ టీ20 టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా సూర్యకుమార్​

ఐసీసీ టీ20 టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా సూర్యకుమార్​

దుబాయ్‌‌‌‌ : గతేడాది అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన టీ20 టీమ్‌‌‌‌ను ఐసీసీ సోమవారం ప్రకటించింది. మొత్తం 11 మందిలో ఇండియా నుంచి నలుగురికి ప్లేస్‌‌‌‌ లభించింది. స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌గా నియమించారు. ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌, స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌, లెఫ్టార్మ్‌‌‌‌ పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌కు చోటు లభించింది. ఈ టీమ్‌‌‌‌లో సూర్యకు చోటు దక్కడం వరుసగా ఇది రెండో ఏడాది కావడం విశేషం. గతేడాది సూర్య 18 టీ20ల్లో 733 రన్స్‌‌‌‌ చేశాడు. విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ దీప్తి శర్మకు మాత్రమే చోటు దక్కింది. 

మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ :  సూర్యకుమార్‌‌‌‌, యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌), నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ (వెస్టిండీస్‌‌‌‌), మార్క్‌‌‌‌ చాప్‌‌‌‌మన్‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌), సికిందర్‌‌‌‌ రజా, రిచర్డ్‌‌‌‌ ఎన్‌‌‌‌గరవ (జింబాబ్వే), అల్పేష్‌‌‌‌ రామ్‌‌‌‌జని (ఉగాండ), మార్క్‌‌‌‌ అడైర్‌‌‌‌ (ఐర్లాండ్‌‌‌‌).