
నాటింగ్హామ్: ఇంగ్లండ్ విమెన్స్ జట్టుతో ఇండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్లో సత్తా చాటాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎడిషన్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఈసారి అలాంటి ఫలితం పునరావృతం కావొద్దని ఇండియా భావిస్తోంది.
ఇంగ్లండ్లో ఆడటం వల్ల పిచ్లు, వాతావరణ పరిస్థితులపై ఓ అంచనాకు రావొచ్చని ఆశిస్తోంది. హార్డ్ హిట్టర్ షెఫాలీ వర్మ రాకతో ఇండియా బ్యాటింగ్ బలోపేతం అయ్యింది. స్మృతి మంధానాతో కలిసి ఓపెనింగ్ చేయనుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్, జెమీమా, రిచా ఘోష్ మెరిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. కొత్త ముఖాలు క్రాంతి గౌడ్, శ్రీ చరణి, సయాలీ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది ఇది తొలి టీ20 సిరీస్ కావడంతో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ స్నేహ్ రాణా, పేసర్ అమన్జోత్ కౌర్పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మరోవైపు ఇంగ్లండ్ సొంతగడ్డపై చాలా బలంగా కనిపిస్తోంది. సివర్ బ్రంట్, అమీ జోన్స్, టామీ బ్యూమోంట్, డ్యానీ వ్యాట్, సోఫీ ఎకెల్స్టోన్తో పాటు యంగ్స్టర్స్ ఇసీ వాంగ్, అలైస్ క్యాప్సీ, సోఫియా డంక్లే సూపర్ ఫామ్లో ఉన్నారు.