
తైపీ: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్.. తైపీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో బోణీ చేశాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో వరల్డ్ 61వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 21–15తో తోటి షట్లర్ శంకర్ సుబ్రమణియన్పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్లో ఆయూష్ షెట్టి 21–17, 21–18తో మూడోసీడ్ లీ చియా హో (చైనీస్తైపీ)పై సంచలన విజయం సాధించాడు.
50 నిమిషాల మ్యాచ్లో ఇండియా ప్లేయర్ బలమైన స్మాష్లు, ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. 2023 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ తరుణ్ మానేపల్లి 21–17, 19–21, 21–12తో మహ్మద్ జాకి ఉబైదుల్లా (ఇండోనేసియా)పై పోరాడి గెలిచాడు. మైరాబా లువాంగ్ మైస్నమ్ 21–23, 12–21తో బ్రియాన్ యాంగ్ (కెనడా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్లో ఉన్నతి హుడా 21–13, 21–17తో అనుపమ ఉపాధ్యాయపై నెగ్గింది. ఆకర్షి కశ్యప్ 9–21, 12–21తో హుంగ్ యి టింగ్ (తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది.