నాన్ బీజేపీ సీఎంల మీటింగ్ త్వరలో

నాన్ బీజేపీ సీఎంల మీటింగ్ త్వరలో

న్యూఢిల్లీ: గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు త్వరలో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘మమత దీదీ నాకు ఫోన్ చేశారు. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలతో మీటింగ్ నిర్వహించాలని ఆమె సూచించారు” అని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిలబెట్టే విషయంలో డీఎంకే కట్టుబడి ఉంటుందని నేను మమతకు హామీ ఇచ్చాను. త్వరలో అపొజిషన్ సీఎంల సమావేశం జరుగుతుంది”అని స్టాలిన్ మరో ట్వీట్ చేశారు.