పరిగి మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ దాడి

పరిగి మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ దాడి
  • పేకాట ఆడుతున్న పదిమంది అరెస్ట్  

పరిగి, వెలుగు :  మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. పోలీసులకు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ వద్ద పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో మంగళవారం రాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీస్ టీమ్ వెళ్లి రైడ్ చేసింది. పట్టుబడిన వారిలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు హజీమ్, అక్రమ్ అహ్మద్, అబ్దుల్ హుస్సేన్, నవాజ్ రెడ్డి, అమీర్ ఖాన్, రాజు రెడ్డి, బోయిని రమేశ్​, అమీర్ అలీ, అమరేందర్, హకీం ఉండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ. 50, 990 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే... టాస్క్ ఫోర్స్ దాడిలో స్వాధీనం చేసుకున్న నగదు లక్షల్లో ఉండగా.. వేలల్లో చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  అరెస్టయిన వారిలో రైల్వే ఉద్యోగి ఉన్నట్లు తెలిసింది. ఈ రైడ్ టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో జరిగింది.