బీఆర్​ఎస్​కు రెండు ఆఫీసులు అవసరమా: టీడీపీ సిటీ అధ్యక్షుడు సాయిబాబా

బీఆర్​ఎస్​కు రెండు ఆఫీసులు అవసరమా: టీడీపీ సిటీ అధ్యక్షుడు సాయిబాబా

 ముషీరాబాద్, వెలుగు: సరికొత్త భూ దందాకు సీఎం కేసీఆర్ తెర తీశారని.. కోకాపేటలోని విలువైన స్థలాన్ని కాజేసేందుకే ‘భారత్ భవన్​’ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని టీడీపీ సిటీ అధ్యక్షుడు సాయిబాబా ఆరోపించారు. శుక్రవారం దోమలగూడలోని టీడీపీ సిటీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీ బిల్డింగులు అవసరమా అని ప్రశ్నించారు.

బంజారాహిల్స్​లో ఇప్పటికే తెలంగాణ భవన్ ఉండగా.. కోకాపేటలో చౌకగా స్థలాన్ని కొట్టేసి సెంటర్ ఫర్ ఎక్స్​లెన్సీ పేరుతో నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ దందా విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.