ఇందిరాపార్క్​ వద్ద టీడీపీ మహాధర్నా

ఇందిరాపార్క్​ వద్ద టీడీపీ మహాధర్నా

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ మోసం చేసిందని ఆరోపిస్తూ సోమవారం ఇందిరాపార్క్​వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ తెలిపారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 3 రోజుల టైమ్​ఇచ్చిన ప్రభుత్వం.. వైన్ షాపులకు మాత్రం 15 రోజుల గడువు ఇచ్చిందని మండిపడ్డారు. 

రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయడం లేదని విమర్శించారు. ధరణిలోని లోపాలను సరిదిద్దడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, గిరిజనులకు పోడు పట్టాల విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.