
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి ఆదివారం (జూన్ 29) తో సరిగ్గా ఏడాదయ్యింది. కరీబియన్ గడ్డపై సౌతాఫ్రికాపై జరిగిన ఫైనల్స్ లో ఓడిపోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతం చేసి టైటిల్ అందుకుంది. చివరి 5 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేశారు. బుమ్రా, అర్షదీప్, హార్దిక్ పాండ్య చివరి 5 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 పరుగుల తేడాతో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 11 ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ కల అప్పటితో తీరింది. ఈ విజయం టీమిండియాకు చాలా మధురమైనది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం.. అంతకముందు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ పై పరాజయం.. 2021,2023లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓడిపోవడం భారత క్రికెట్ జట్టును కృంగదీశాయి. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ తో తాము ఐసీసీ టైటిల్ గెలవలేమనే సెంటి మెంట్ కు బ్రేక్ పడింది. ఈ విజయోత్సవాన్ని ఏడాది తర్వాత బర్మింగ్హామ్లో భారత క్రికెటర్లు తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ పర్యటనలో ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో ఉంది. రెండో టెస్ట్ బర్మింగ్హామ్ వేదికగా బుధవారం (జులై 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బర్మింగ్హామ్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ తొలి వార్షికోత్సవ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకల వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత జట్టు ఆ క్షణాన్ని రెండు వేర్వేరు కేక్లతో సత్కరించింది. ఒక కేక్ పై 'టీమ్ ఇండియా' అని, మరొక కేక్ పై 'ఛాంపియన్స్ టీ20 వరల్డ్ కప్ 2024' అని రాసి ఉంది. బుమ్రా ఒక కేక్ కట్ చేస్తే.. సిరాజ్ మరొక కేక్ ను కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంత్ జడేజాకు కేక్ తినిపిస్తూ సరదాగా ఆటపట్టించాడు. "హ్యాపీ రిటైర్మెంట్ జడ్డూ భాయ్" అని కేక్ తినిపించి తన సంతోషాన్ని పంచుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత జడేజా టీ 20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
In Birmingham, bringing in one-year anniversary of #TeamIndia's T20 World Cup 🏆 Triumph!
— BCCI (@BCCI) June 29, 2025
Core memory 🥹 pic.twitter.com/FUUjbKdnHN