ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌‌‌‌లో .. టీమిండియా ప్లేయర్స్ శార్దూల్‌‌‌‌, సర్ఫరాజ్ సెంచరీలు

 ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌‌‌‌లో .. టీమిండియా ప్లేయర్స్  శార్దూల్‌‌‌‌, సర్ఫరాజ్ సెంచరీలు

బెకెన్‌‌‌‌హామ్: ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌కు ముందు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌  ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టాడు. ఈ పోరులో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగిన శార్దూల్ (68 బాల్స్‌‌‌‌లో 122 నాటౌట్‌‌‌‌)  మెరుపు సెంచరీ కొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ (76 బాల్స్‌‌‌‌లో 101) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు బౌలింగ్‌‌‌‌లోనూ మెప్పించిన శార్దూల్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా తుది జట్టులో చోటుకు నితీష్ రెడ్డికి బలమైన పోటీదారుగా మారాడు.  

ఈ మ్యాచ్‌‌‌‌లో తొలుత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా మెయిన్ టీమ్ 469 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్, శుభ్‌‌‌‌మన్ గిల్ ఫిఫ్టీలతో రాణించారు. తర్వాత సర్ఫరాజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ సెంచరీలతో మెయిన్ టీమ్‌‌‌‌కు ఇండియా–ఎ దీటుగా బదులిచ్చింది. అయితే, సోమవారం వరకూ జరగాల్సిన ఈ మ్యాచ్‌‌‌‌ను టీమ్ మేనేజ్‌‌‌‌మెంట్ మూడో రోజు, ఆదివారం మధ్యలోనే నిలిపివేసింది. ప్లేయర్ల రెస్ట్‌‌‌‌, వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం రెస్ట్ తీసుకొని మంగళవారం తొలి టెస్టు వేదిక అయిన లీడ్స్‌‌‌‌కు జట్టు బయల్దేరుతుందని బీసీసీఐ ప్రకటించింది.