మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్

మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్

హైదరాబాద్: మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆఘమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్.. మెదక్ కలెక్టర్ నివేదిక కబ్జా చేసినట్లు ఇవ్వడంతో.. అంతే స్పీడుతో మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి పంపిన లేఖపై గవర్నర్ ఆమోద ముద్ర పడింది. మంత్రి ఈటెల భూ కబ్జాలపై కలెక్టర్  విచారించి నివేదిక ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రి ఈటెలను బర్తరఫ్ చేయాలని సిఫారసు చేస్తూ సీఎం కేసీఆర్ గవర్నర్ కు లేఖ పంపడం.. గవర్నర్ కూడా వెంటనే ఆమోద ముద్రవేయడం చకాచకా జరిగిపోయాయి.