
తెలంగాణ ప్రగతే తమ విజన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వం చేపట్టని ప్రగతి పనులను ముందుకుతీసుకెళ్తామని చెప్పారు.హోటల్ ఐటిసి కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్ధాలుగా స్థిరాస్తి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సుస్థిరమైన విధానంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను కొనసాగిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.