పంట రుణమాఫీకి స్పెషల్ కార్పొరేషన్

పంట రుణమాఫీకి స్పెషల్ కార్పొరేషన్
  • త్వరలో ఏర్పాటు చేస్తామనిప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ సర్కార్ మంగళవారం ట్విట్టర్​లో ప్రకటించింది. ‘‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతు న్నది. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది”అని కాంగ్రెస్ సర్కార్ పేర్కొంది. నెల రోజుల పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలతో కూడిన వీడియోను పోస్ట్ చేసింది.

‘‘ఆధిపత్యం ఓడింది.. గడి గోడ కూలిం ది.. ఆత్మగౌరవం ఉరకలేసింది.. అహంకారం తలవంచింది.. స్వేచ్ఛ రెక్కలు తొడిగింది.. ప్రజా పాలన ఆవిర్భవించింది. నిర్బంధాల మధ్య అణచివేతకు గురైన గొంతులని సవరించుకుని.. ఇది సకల జనులు పాడుతున్న స్వేచ్ఛా గీతం.. ఇది సబ్బండ వర్గాలు ఎగరేస్తున్న విజయ పతాకం’’ అని ట్వీట్​లో పేర్కొంది.