తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు

 తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు
  • చైర్మన్ గా వకుళాభారణం కృష్ణ మోహన్ రావు

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో పార్టీ నేతలకు జోష్ పెంచేలా ఆ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత వకుళాభారణం కృష్ణ మోహన్ రావును బీసీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బీసీ కమిషన్ సభ్యులుగా సిహెచ్ ఉపేందర్, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్ లను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కమిషన్ చైర్మన్ తోపాటు సభ్యులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ హోదాతో ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తారు.