తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

 తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

హైదరాబాద్:  తెలంగాణలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో నేరుగా తరగతులు జరగని పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో చాలా మంది అడ్మిషన్లు తీసుకుపోలేకపోతున్నారని గుర్తించి గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీలు అనుమతి లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని... ప్రైవేటు కాలేజీలు అనుమతి తీసుకుని అడ్మిషన్లు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. ప్రత్యక్ష తరగతులపై ఇప్పటి వరకు ఎవరికీ అనుమతులివ్వలేదని.. భవిష్యత్తులో ఉత్తర్వులిచ్చే వరకు ఎవరూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు.