భగ్గుమంటున్న భానుడు...రాష్ట్రంలో మొదలైన వడగాలులు

భగ్గుమంటున్న భానుడు...రాష్ట్రంలో మొదలైన వడగాలులు

తెలంగాణలో కొద్ది రోజులుగా ఎండలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా మొదలయ్యాయి. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

ఆగ్నేయ దిశ‌ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొన‌సా‌గు‌తోంది. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెర‌గ‌ను‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు
తెలి‌పారు.