డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కలెక్టర్ హారిత ఇళ్లను ప్రారంభిస్తుండగా … కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. డబ్బులు తీసుకొని సొంత ఇళ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇళ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 మందికి ఇళ్ల కోసం కేటాయించిన భూమిని 5 వేలకు ప్రభుత్వం తీసుకొని  20 మందికే ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు మహిళలు.