సీఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్టుల అటాక్

సీఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్టుల అటాక్

షోపియాన్: జమ్మూ కశ్మీరులో టెర్రరిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై అటాక్ చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో వారి మీద ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. షోపియాన్ జిల్లాలోని జైనపొరాలో జరిగిన ఈ ఘటనలో సీటీ అజయ్ కుమార్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతడికి ప్రాణాపాయం తప్పిందని, దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. టెర్రరిస్టుల దాడిలో పలువురు జవాన్లకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయని తెలిసింది. ఉగ్రవాదుల అటాక్ ను భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని సమాచారం.