ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

లోక్ సభ ఎన్నికలు 2024 జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అరవిందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేశాడు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన తన రాజీనామా లేఖ పంపారు. తన రాజీనామా లేఖలో 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

ఇదే విషయాన్ని రాజీనామా లేఖలో రాశారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకిస్తోందని లవ్లీ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌తో  పొత్తు పెట్టుకోవడానికి పార్టీ ముందుకు సాగిందని పేర్కొన్నాడు. ఆగస్ట్ 2023లో ఈ పదవికి నియమితులైన లవ్లీ, తాను పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను కాపాడలేనందున, తాను చెప్పిన పదవిలో కొనసాగడానికి కారణం కనిపించడం లేదని అన్నారు.