విద్యార్థుల సమస్యలు తీర్చాలని బీజేవైఎం క్యాండిల్స్ తో నిరసన  

విద్యార్థుల సమస్యలు తీర్చాలని బీజేవైఎం క్యాండిల్స్ తో నిరసన  

ఒకవైపు కరెంట్ కష్టాలు..మరోవైపు వాటర్ ప్రాబ్లమ్. ఈ రెండు సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో చేసేది ఏమీ లేక చీకటిలో నే కాలం వెల్లదీస్తున్నారు. ఓయూ లోని సైక్లింగ్ స్టేడియం  సమీపం లోని స్పోర్ట్స్ హాస్టల్ లో గత నెల రోజుల నుండి కరెంట్,వాటర్  లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని   బీజే వైఎం సిటీ ప్రెసిడెంట్ శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై  హాస్టల్ ను సందర్శించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

స్టూడెంట్స్ కు కరెంట్ లేకపోవడంతో క్యాండీల్స్ ను ఇచ్చి వాటితో వినూత్న నిరసన తెలిపారు.  విద్యార్థులు పడుతున్న బాధలపై హాస్టల్ వార్డెన్ ను నిలదీశారు. త్వరగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని..  లేని పక్షంలో స్పోర్ట్స్ మినిస్టర్ ఇంటిని ,ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలువురు బీ జే వై ఎం నాయకులు పాల్గొన్నారు.