పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్ సిగ్నల్

పీఆర్సీ  ప్రకటనకు  ఈసీ గ్రీన్ సిగ్నల్

పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోడ్ పీఆర్సీకి అడ్డంకిగా ఉండడంతో ఆర్థిక శాఖ సీఈసీ అనుమతి కోరూతూ లేఖ రాసింది.దీనిపై స్పందించిన ఈసీ పీఆర్సీ ప్రకటనపై ఇబ్బంది లేదని చెప్పింది. పీఆర్సీ పేరుతో ఎన్నికల ప్రచారం చేయకూడదని కండీషన్ పెట్టింది. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించకూడదని చెప్పింది. త్వరలోనే కేసీఆర్  పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.