ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు

ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న బీజేపీ ఎన్నికల సభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో

ఉంటాయని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట -గ్రీన్​ల్యాండ్స్ నుంచి పరేడ్​గ్రౌండ్​వరకు టివోలీ ఎక్స్ రోడ్​నుంచి ప్లాజా ఎక్స్​రోడ్స్ వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.