ఇంటికొచ్చే బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తరు

ఇంటికొచ్చే బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తరు

కరోనా ఎఫెక్ట్ తో సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 5న ఇచ్చే బెస్ట్ టీచర్, లెక్చరర్ అవార్డును ఆయా అవార్డు గ్రహీతలకు ఇంటివద్దనే ఇవ్వాలని సర్కార్ నిర్ణ‌యించింది. ఈ మేరకు బుధవారం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రాంచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. అవార్డులు అందజేసేందుకు అన్ని విభాగాల్లో నోడల్ ఆఫీసర్ల‌ను నియమించనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగానే ఈ డెసిషన్ తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.