ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది : వివేక్ వెంటస్వామి

ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది : వివేక్ వెంటస్వామి

మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రూ. 62 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని వివేక్ వెంటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, సింగరేణి ఏరియా జీఎం సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.