బీజేపీ ఆధ్వర్యంలో మున్సి పల్ కార్పొరేషన్వద్ద ధర్నా
మేడిపల్లి , వెలుగు : అధికారుల నిర్లక్ష్యంతోనే పీర్జాదిగూడ కార్పొరేషన్పరిధిలోని పార్కులు , ప్రభుత్వ భూములు, నాలాలు కబ్జా అవుతున్నాయని బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డి ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు , నాలాలు , పార్కుల కబ్జాలపై ఫిర్యాదు .. చేసినా అధికారులు స్పందించడంలేదంటూ బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ఆఫీసు వద్ద కూర్చొని బీజేపీ నేతలు నిరసన తెలిపారు. కమిషనర్ పి . రామకృష్ణారావు వచ్చి డిమాండ్లపై స్పందించి రోడ్డు కబ్జాపై చర్యలు తీసుకోవడంతో పాటుగా పార్కులకు గోడలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, నాయకులు మోహన్రెడ్డి సుధ, జాహెదాబేగం, గీతా, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .