న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దాదాపు 40 శాతం పెరగడంతో బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్ ధర లీటరుకు రూ. 25 చొప్పున పెంచామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఏఎంసీలు) ప్రకటించాయి. సాధారణ పెట్రోల్ పంపుల్లో అమ్మే రేట్లు మారలేదు. బస్ ఫ్లీట్ ఆపరేటర్లు, మాల్స్ , ఎయిర్పోర్టుల వంటి బల్క్ యూజర్లు చమురు కంపెనీల నుండి నేరుగా ఆర్డర్ చేయడానికి పెట్రోల్ బంక్ల వద్ద క్యూలు కట్టడంతో ఈ నెలలో పెట్రోల్ పంపుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో నయారా ఎనర్జీ, జియో-బిపి , షెల్ వంటి ప్రైవేట్ రిటైలర్లు బాగా నష్టపోతున్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ప్రభుత్వ కంపెనీలు ధరలను పెంచలేదు. ఇంత తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీలు అమ్మలేకపోతున్నాయి. నష్టాలకు అమ్మడానికి బదులు పంపులను మూసివేస్తామని చెబుతున్నాయి.2008లో ఇలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ ఏఎంసీల మాదిరిగా సబ్సిడీ ధరలకు అమ్మలేక 1,432 పెట్రోల్ పంపులలను మూసివేసింది.బల్క్ యూజర్లు పెట్రోల్ పంపులవైపు చూస్తుండటంతో ఇదే పరిస్థితి మళ్లీ ఏర్పడవచ్చని అంటున్నారు. తాజా పెంపు కారణంగా బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్ ధర ముంబైలో లీటరుకు రూ.122.05కు పెరిగింది. పెట్రోల్ పంపులో ధర రూ.94.14 మాత్రమే. ఢిల్లీలో బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ. 86.67 కాగా బల్క్/ ఇండస్ట్రియల్ యూజర్లు మాత్రం రూ.115 చొప్పున చెల్లించాలి. ప్రపంచవ్యాప్తంగా చమురు ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఏఎంసీలు నవంబర్ 4, 2021 నుండి పెట్రోల్ డీజిల్, రిటైల్ ధరలను పెంచలేదు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలే ఇందుకు కారణమని అంటున్నారు. నయారా ఎనర్జీ, జియో-బిపి, షెల్ వంటి ప్రైవేట్ ఇంధన రిటైలర్లు ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసి) కంటే ఎక్కువ ధరలకు ఫ్యూయల్ను అమ్మితే కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉన్నందున పాత ధరలనే కొనసాగిస్తున్నాయి.
బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్ ధరలు పెరిగినయ్
- బిజినెస్
- March 21, 2022
లేటెస్ట్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ : ఇలా చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవు
- Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్ పెట్టండి..
- Indian Premier League: భారీగా తగ్గిన IPL ఫ్రాంచైజీల ఆదాయం..
- Sabari movie review: కూతురి కోసం తల్లి పోరాటం.. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన శబరి ఎలా ఉందంటే?
- Love Me Movie: లవ్ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ
- దేశంలో మోదీ AA ట్యాక్స్ వసూల్ చేస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి
- టార్గెట్ జగన్... కడప జిల్లాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి..
- మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి : సీఎం జగన్
- తెలంగాణ తెచ్చిందే సిద్దిపేట: హరీశ్ రావు
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్