ప్రచార వాహనం ఢీకొని ఒకరు మృతి... అచ్చంపేటలో విషాదం

ప్రచార వాహనం ఢీకొని ఒకరు మృతి... అచ్చంపేటలో విషాదం
  • ప్రచార వాహనం ఢీకొని ఒకరు మృతి
  • అచ్చంపేటలో విషాదం 

అచ్చంపేట, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో ఎన్నికల ప్రచార వాహనం ఢీకొని ఒకరు చనిపోయారు.  ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం...లింగాల మండలం దత్తారం గ్రామానికి చెందిన కోట్ల భాస్కర్ (30) గురు వారం అచ్చంపేట నుంచి తెలకపల్లికి బైక్​పై వెళ్తున్నాడు. పట్టణంలోని శివ సాయి నగర్ కాలనీ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బీఎస్పీకి చెందిన ప్రచార వాహనం అకస్మాత్తుగా సిగ్నల్స్ ఇవ్వకుండా టర్న్ తీసుకుంది. దీంతో వెనక వస్తున్న భాస్కర్​ప్రచార వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.