ఆటోమేటిక్​గా వాటర్, టీ, కాఫీ అందిస్తుంది

ఆటోమేటిక్​గా వాటర్, టీ, కాఫీ అందిస్తుంది

మాదాపూర్, వెలుగు: దేశంలోనే మొదటిసారి గోల్డ్​ఏటీఎంను రూపొందించిన జెమ్ ఓపెన్‌ క్యూబ్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు మరో వినూత్న మెషీన్(డబ్ల్యూటీసీ)​ను తయారుచేశారు. ఈసారి కాఫీ, టీ, వాటర్​బాటిల్స్, బిస్కెట్లు అందించేలా రూపొందించారు. మాదాపూర్​లోని ఓ హోటల్​లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డబ్ల్యూటీసీ మెషీన్​ను ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హీరో మంచు మనోజ్ లాంచ్ చేశారు. 

జెమ్ ఓపెన్‌ క్యూబ్ సీఈఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మెషీన్ ఆటోమేటిక్​గా టీ, కాఫీ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు పంపిణీ  చేస్తుందని తెలిపారు. రూ.1.47లక్షలకే మార్కెట్​లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్  పాల్గొన్నారు.