కేసీఆర్ ను కాదని వెళ్లిన వాళ్లు కనుమరుగయ్యారు

కేసీఆర్ ను కాదని వెళ్లిన వాళ్లు కనుమరుగయ్యారు
  • ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

హైదరాబాద్: కేసీఆర్ ను కాదని వెళ్లిన వాళ్లు కనుమరుగు అయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈటల బీజేపీలో చేరడంపై ఆయన స్పందించారు.  ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే  ఈటల బిజెపి లో చేరాడని, వంద మంది తరుణ్ చుగ్ లు వచ్చినా కేసీఆర్ కు ఏమి చేయలేరని ఆయన పేర్కొన్నారు. కమలం వాడిపోయిన పువ్వు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను కాదని అడిగిన వాళ్ళు కనుమరుగు అయ్యారు.. ఈ విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ దేశ రాజకీయాలకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బంగారు తెలంగాణ సిద్దింపజేయడానికే కేసీఆర్ ఇక్కడే వున్నారని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.