కోకాపేట భూముల కుంభకోణం బయటపెడతా

కోకాపేట భూముల కుంభకోణం బయటపెడతా

హైదరాబాద్ లోని కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని తెలిపారు. వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని చెప్పారు. రేపు అన్ని వివరాలు బయటపెడతానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.