సీపీఎస్​ను రద్దు చేయాలి : టీఎన్జీవో నేతలు

సీపీఎస్​ను రద్దు చేయాలి :  టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన  కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ( సీపీఎస్ ను)ను  రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ( ఓపీఎస్ ) ను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను టీఎన్జీవో నేతలు కోరారు. 

పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ ఎస్ )  ను  ప్రారంభించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.  శనివారం ప్రజా భవన్ లో భట్టి విక్రమార్కను  టీఎన్జీవో జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్,  స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్  డైరెక్టర్ దయానంద్ కలిశారు.