హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ( సీపీఎస్ ను)ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ( ఓపీఎస్ ) ను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను టీఎన్జీవో నేతలు కోరారు.
పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ ఎస్ ) ను ప్రారంభించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. శనివారం ప్రజా భవన్ లో భట్టి విక్రమార్కను టీఎన్జీవో జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్, స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ దయానంద్ కలిశారు.