డబుల్ ధమాకా..ఇవాళ రాయల్స్‌‌తో ఆర్‌‌సీబీ, ఢిల్లీతో కోల్‌‌కతా

డబుల్ ధమాకా..ఇవాళ రాయల్స్‌‌తో ఆర్‌‌సీబీ, ఢిల్లీతో కోల్‌‌కతా

ఢీఅబుదాబి/షార్జా:  రెండు వారాలుగా ఐపీఎల్​ను ఎంజాయ్​ చేస్తున్న ఫ్యాన్స్‌‌కు డబుల్‌‌ కిక్‌‌ లభించనుంది.  ఇప్పటిదాకా రోజుకో మ్యాచ్​ చొప్పున ధనాధన్​ లీగ్​ను ఎంజాయ్​ చేసిన ఫ్యాన్స్ కోసం​ నాలుగు జట్లు రెడీ అవుతున్నాయి. ఐపీఎల్​ 13లో శనివారం తొలి డబుల్​ హెడర్​ జరగనుంది. ఫస్ట్ రాజస్తాన్​ రాయల్స్​– రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్– కోల్​కతా నైట్​రైడర్స్​ పరుగుల విందు అందించనున్నాయి. ఐపీఎల్​ 13లో  మొత్తం పది డబుల్​ హెడర్లు ఉండగా ఈ వీకెండ్‌ నుంచి ఈ డబుల్​ ఫీస్ట్ స్టార్ట్​ అవ్వనుంది.​

‘రాయల్’​ ఫైట్​…

రాజస్తాన్​ రాయల్స్​, రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు మధ్యాహ్నం అబుదాబిలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ లీగ్​లో ప్లేయర్లను మంచు ఇబ్బంది పెట్టగా.. ఇప్పుడు ఉక్కపోత సవాల్​ విసరనుంది. ఇదికాక.. షార్జా, దుబాయ్​తో పోలిస్తే అబుదాబిలోని షేక్​ జియెద్‌‌ స్టేడియం పెద్దది కావడం మరో చాలెంజ్​. లీగ్​లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్​లాడిన ఇరుజట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. వరుస విజయాలతో లీగ్​ను సూపర్​గా మొదలుపెట్టిన రాయల్స్​.. బుధవారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో తేలిపోయింది. దీంతో  ఆ జట్టు కొంచెం ఒత్తిడిలో ఉంది.  కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​, బట్లర్​, సంజూ శాంసన్​ మరోసారి బ్యాటింగ్​లో కీలకం కానున్నారు. వరుసగా ఫెయిలవుతున్న రాబిన్​ ఊతప్ప ప్లేస్​లో యశస్వి జైస్వాల్, బౌలర్లలో అంకిత్​ రాజ్​ఫుత్​ స్థానంలో వరుణ్​ ఆరోన్​ తుది జట్టులోకి  రావొచ్చు.  ఇక, ముంబై ​పై సూపర్​ ఓవర్​లో నెగ్గిన బెంగళూరు ఫుల్​ జోష్​లో ఉంది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫామ్​ తప్ప ఆ జట్టుకు పెద్దగా సమస్యల్లేవు. కోహ్లీ టచ్​లోకి వస్తే.. ఆర్​సీబీ వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ కూడా అందుబాటులోకి వస్తే జట్టు బలం పెరగనుంది.