నేడు పలు MMTS రైళ్లు క్యాన్సిల్

నేడు పలు MMTS రైళ్లు క్యాన్సిల్

కాచిగూడ—ఫలక్ నుమా మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ తో పాటు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆదివారం పలు MMTS  రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 47212 , 47214 లింగంపల్లి-–ఫలక్ నుమా MMTS సర్వీసు లు కాచిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పాక్షికంగా రద్దు చేశారు. లింగంపల్లి నుంచి ఈ రైళ్లు కాచిగూడ వరకు మాత్రమే ప్రయాణం చేయనున్నాయి. ట్రైన్ నంబర్ 47189 ఫలక్ నుమా –లింగంపల్లి MMTS సర్వీస్ ను ఫలక్ నుమా నుంచి కాచిగూడ వరకు పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఫలక్ నుమా నుంచి వెళ్లే ప్రయాణికులకు ఈ ట్రైన్ కాచిగూడ నుంచే అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 47169 ఫలక్ నుమా- హైదరాబాద్  MMTS సర్వీ స్ కూడా ఫలక్ నుమా కాచిగూడ మధ్య రద్దు చేశారు. ఈ ట్రైన్ కూడా కాచిగూడ  నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.