మిర్చినారు పీకేస్తరా.. నా ప్రతాపం  ఏంటో చూపిస్తా

మిర్చినారు పీకేస్తరా.. నా ప్రతాపం  ఏంటో చూపిస్తా

గూడూరు, వెలుగు: రైతులు వేసిన మిర్చి నారు పీకేసే ధైర్యం ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎవరిచ్చారు. బక్క రైతులపైనా మీ ప్రతాపం. మొక్కే కదా అని పీకేశారు కదా.. చూడండి తర్వాత నా ప్రతాపం ఎలా ఉంటుందో అంటూ ఫారెస్ట్ ఆఫీసర్లపై మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. మహబూబాబాద్​జిల్లా గూడూరు మండలంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లెపెల్లికి చెందిన కొంతమంది రైతుల భూముల్లో శుక్రవారం ఫారెస్ట్ ఆఫీసర్లు మిర్చి నారును పీకేసినట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ గతంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు చాలాసార్లు చెప్పినా వారి ప్రవర్తన మారడం లేదని అన్నారు. మండలంలో వందల ఎకరాలు ఎవరి వల్ల అంతరించిపోయాయో తమకు తెలుసన్నారు. సాగులో ఉన్న పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ మాటలను ఫారెస్ట్ ఆఫీసర్లు బేఖాతరు చేయడం సరైంది కాదన్నారు.