పాట్నా: కరోనా నుంచి వారి దేశాన్ని కాపాడుకోవడంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని, అదే వైరస్ నుంచి మన దేశాన్ని రక్షించడంలో ప్రధాని మోడీ సఫలమయ్యారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. బిహార్లోని దర్భంగాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు పలు విషయాలపై నడ్డా మాట్లాడారు. ‘యూఎస్ ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. కరోనాను సరిగ్గా డీల్ చేయలేదని ట్రంప్ పై విమర్శలు వస్తున్నాయి. కానీ మోడీజీ కరోనా నుంచి మన దేశాన్ని కాపాడారు. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని దేశంతోపాటు 130 కోట్ల మంది జనాభాను మోడీ రక్షించారు’ అని నడ్డా పేర్కొన్నారు.
#WATCH: Results of US elections are being declared and the allegation against Donald Trump is that he could not handle COVID-19 properly, but Modi ji saved the country with 130-crore population by taking timely decision: BJP President JP Nadda in Darbhanga#BiharElections pic.twitter.com/Rs67IHqHDL
— ANI (@ANI) November 5, 2020