టీఎస్పీఎస్సీ రిపోర్టును  విడుదల చేసిన గవర్నర్ తమిళిసై

టీఎస్పీఎస్సీ రిపోర్టును  విడుదల చేసిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2020–21లో మూడు నోటిఫికేషన్లు మాత్రమే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లలో 149 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ 2020–21 వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టును గవర్నర్ తమిళిసై విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్​ జనార్దన్​రెడ్డి నేతృత్వంలో కమిషన్ సభ్యులు రమావత్ ధన్ సింగ్, లింగారెడ్డి, అరుణకుమారి, కారం రవీందర్​రెడ్డి, చంద్రశేఖర్​రావు, సత్యనారాయణ, సెక్రటరీ అనితారామచంద్రన్ మంగళవారం రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిశారు. టీఎస్పీఎస్సీ వార్షిక నివేదికను ఆమెకు సమర్పించారు. ఈ సందర్భంగా గతేడాది టీఎస్పీఎస్సీ పనితీరుతోపాటు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల భర్తీ తదితర అంశాలను చైర్మన్ జనార్దన్​రెడ్డి గవర్నర్​కు వివరించారు.