తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు : మంత్రి పొన్నం ప్రభాకర్

రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికి ప్రజల మంచి చెడులో భాగస్వామ్యులం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచగా శ్రావణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సంవత్సరం అందరికి మంచే జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మన ప్రాంతాన్ని,మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమ పడాలని సూచించారు. అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం తెలిపారు.