హైదరాబాద్, వెలుగు: డిస్టెన్స్లో డిగ్రీ, పీజీ చదవాలనుకునే వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ మంచి వార్త చెప్పింది. ఏటా రెండుసార్లు అడ్మిషన్లు విడుదల చేసేందుకు యూనివర్సిటీలకు అనుమతిచ్చింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆదివారం డిస్టెన్స్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొదటి విడత అడ్మిషన్లను జులై 1 నుంచి 30 వరకు, రెండో విడత జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్నట్టు ఓయూ ప్రకటించింది. అప్లై చేసుకోవాలనుకునే వాళ్లు www.oucde.net లో దరఖాస్తును పొందవచ్చు. ఎంచుకున్న కోర్సుల్లోనే స్టూడెంట్లు చేరాల్సి ఉంటుంది. ఫీజు, అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు వర్సిటీలకూ కొంతమేర ఆర్థికంగా కలిసి వస్తుందని, నిధుల సమస్య తీరుతుందని ఓయూలోని జి. రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. గణేశ్ అన్నారు.
అడ్మిషన్లు అందించే కోర్సులు
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో నాలుగు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రెండు విభాగాలుగా అడ్మిషన్లను నిర్వహించనున్నారు. అదే విధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులకూ అడ్మిషన్లు నిర్వహిస్తారు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, బీఈడీ
పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ, సంస్కృతం), ఎంఏ (ఫిలాసఫీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సైకాలజీ), ఎంకాం, ఎమ్మెస్సీ(మ్యాథ్స్), ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్)
పీజీ డిప్లోమా కోర్సులు: మ్యాథ్స్, బిజినెస్మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్