ఒక్కసారి చార్జ్​ చేస్తే 323 కిలోమీటర్లు

ఒక్కసారి చార్జ్​ చేస్తే 323 కిలోమీటర్లు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ఎ ఫ్​77 మ్యాక్–2ని రూ.2.99 లక్షల ఎక్స్​షోరూం ధరతో విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి డైనమిక్ రీజెన్, ట్రాక్షన్ కంట్రోల్‌‌‌‌ గల బైక్​ఇదని తెలిపింది. 

ఎఫ్​77 మ్యాక్​ను ఒక్కసారి చార్జ్​చేస్తే 323 కిలోమీటర్లు వెళ్తుంది.  మొదటి వెయ్యి మంది కొనుగోలుదారులకు రూ.మూడు లక్షలకే అమ్ముతారు.  అల్ట్రావయొలెట్ ఎఫ్​77 మ్యాక్​ 2లో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది.  మొదటి ఎనిమిది లక్షల కిలోమీటర్లు లేదా 8 సంవత్సరాల వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.