న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ఎ ఫ్77 మ్యాక్–2ని రూ.2.99 లక్షల ఎక్స్షోరూం ధరతో విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి డైనమిక్ రీజెన్, ట్రాక్షన్ కంట్రోల్ గల బైక్ఇదని తెలిపింది.
ఎఫ్77 మ్యాక్ను ఒక్కసారి చార్జ్చేస్తే 323 కిలోమీటర్లు వెళ్తుంది. మొదటి వెయ్యి మంది కొనుగోలుదారులకు రూ.మూడు లక్షలకే అమ్ముతారు. అల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2లో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. మొదటి ఎనిమిది లక్షల కిలోమీటర్లు లేదా 8 సంవత్సరాల వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.