రాష్ట్రానికి రానున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

రాష్ట్రానికి రానున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రమంత్రులు రానున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3,4న మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర పథకాల అమలు.. బడుగు బలహీన వర్గాలకు పథకాలు అందుతున్న విధానాన్ని తెలుసుకోనున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న నిధుల వినియోగంపై కేంద్రమంత్రులు ఆరాతీయనున్నారు. పార్టీ కార్యకర్తలు,నాయకులతో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఆగస్టు 28, 29, 30 తేదీలలో కేంద్ర సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించగా.. ఆగస్టు 29 ,30 తేదీలలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మరో సహాయ మంత్రి బీఎల్ వర్మ పర్యటించారు.