దేశంలో కనిపించని అభివృద్ధి

దేశంలో కనిపించని అభివృద్ధి

మోడీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నఆయన… ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారు. దేశంలో ఏ రంగంలోనూ ప్రగతి కనిపించడం లేదని ఆరోపించారు. మోడీ సర్కారు అచ్చేదిన్ అంటూ ప్రజలను మోసం చేస్తోందని చెప్పారు. దేశంలోకి పెట్టుబడులు రావడం లేదని.. విదేశీ నిల్వలు కూడా పడిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చారిత్రక తప్పిదాలన్న చిదంబరం… ఈ చర్యతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందన్నారు.