
లక్నో: భార్య పరాయి మగాడితో కాస్త క్లోజ్గా మాట్లాడితేనే భర్తలు తట్టుకోలేరు. అలాంటిది తన భార్య ఆమె ప్రియడుతో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడు ఓ భర్త. ఇక అంతే.. కోపం కట్టలు తెంచుకుంది. భరించలేనంత ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఆవేశంలో తట్టుకోలేక భార్య ముక్కు కొరికేశాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని ఒక గ్రామంలో రామ్ ఖిలావన్ అనే వ్యక్తి తన భార్య (25)తో కలిసి ఉంటున్నాడు. రామ్ ఖిలావన్ భార్య గత కొద్ది రోజులుగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఇది మంచి పద్దతి కాదని.. ఇకనైనా అలవాటు మార్చుకోవాలని పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రియుడుతో అక్రమ సంబంధం అలాగే కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 18) రహస్యంగా ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. రహస్యంగా భార్యను ఫాలో అయిన రామ్ ఖిలావన్.. భార్య, ఆమె ప్రియుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
సహనం కోల్పోయిన ఖిలావన్ ఆవేశంలో ఆమె ప్రియుడి ముందే భార్య ముక్కు కొరికేసి పారిపోయాడు. ఆమె కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి లక్నో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధిత మహిళ భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మోసం చేసిన భార్యకు భలే బుద్ధి చెప్పావని కొందరు.. అలాంటి వ్యక్తిని వదిలేయడం బెటర్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.