
ఉత్తరప్రదేశ్లో దారుణం..ప్రియుడితో కలిసి కన్నబిడ్డలను హత్య చేసిందో కసాయి తల్లి..ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామంతో కల్లుమూసుకుపోయిన మహిళ ప్రియుడితో హానీమూన్ వెళ్లేందుకు కడుపున పుట్టిన పిల్లలను దారుణంగా కడతేర్చింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని రోడ్కలి గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ముస్కాన్ అనే మహిళకుచెందిన ఇద్దరు పిల్లలు గురవారం (జూన్ 19) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విషప్రయోగం వల్లే ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చిన్నారులకు ఎవరు విషం పెట్టి ఉంటారు.. చిన్నారులను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు పచ్చినిజాలు బయటికొచ్చాయి.
ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపింది సొంత తల్లేనని పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలను ముస్కాన్ హత్య చేసింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ముస్కాన్ పై అనుమానించిన పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తే ప్రియుడితో కలిసి తానే హత్య చేశానని ముస్కాన్ ఒప్పుకుంది.
ముస్కాన్ భర్త వసీం పనికోసం చండీగఢ్ లో వెళ్లాడు. గత కొంతకాలంలో జునైత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న ముస్కాన్.. ప్రియుడితో ఏకాంతం ఉండేందుకు అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపాలని నిర్ణయించుకంది. ప్రియుడు జునైద్ తో కలిసి ప్లాన్ వేసింది.
ముస్కాన్ తన ప్రేమికుడి జునైత్ తో సాయంతో ఇద్దరు పిల్లలు ఐదేళ్ల వయసున్న అర్హాన్, ఏడాది వయసున్న ఎనయను దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో ఉండేందుకు అడ్డంకిగా ఉన్నారని వారిని చంపిందని పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం.. ఇద్దరు పిల్లలను చంపి ప్రియుడితో హానీమూన్ వెళ్లాలనుకుంది ముస్కాన్.. అనుకున్నట్లుగానే పిల్లలకు విషం ఇచ్చి చంపేసింది. చిన్నారుల తండ్రి వసీం ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముస్కాన్ ను అరెస్ట్ చేశారు. ముస్కాన్ ఘాతుకాన్ని ఆమెచేతనే కక్కించారు. ముస్కాన్ కటకటాలు లెక్కిస్తోంది. ముస్కాన్ ప్రియుడు జునైద్ పరారీలో ఉన్నాడు.