సిటీలో రోడ్లపై నిలిపిన వెహికల్స్ సీజ్

సిటీలో రోడ్లపై నిలిపిన వెహికల్స్ సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీ రోడ్ల వెంట నెలల తరబడి పార్క్​చేసిన వెహికల్స్​ను ట్రాఫిక్​ పోలీసులు సీజ్ ​చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 34 వెహికల్స్ ను సీజ్​చేసినట్లు సిటీ ట్రాఫిక్ ​చీఫ్​ఏవీ రంగనాథ్​తెలిపారు. కాలనీలు, పబ్లిక్​పేసుల్లో కొన్ని నెలలుగా నిలిపి ఉంచిన వెహికల్స్​కు 15 రోజుల కింద నోటీసులు అంటించామని చెప్పారు. ఓనర్స్​ నుంచి ఎలాంటి స్పందన రాని వాటిని గోషామహల్‌‌ పోలీస్ స్టేడియంకు తరలిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం నుంచి స్పెషల్‌‌ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మొదటిరోజు అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్‌‌ ‌‌పరిసర ప్రాంతాల్లోని వెహికల్స్​ను సీజ్ చేశామని వెల్లడించారు. కోర్టు అనుమతితో త్వరలో వీటిని వేలం వేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వెహికల్స్​ ఏమైనా రోడ్లపై ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.