జేఎన్టీయూ రెక్టార్​గా విజయకుమార్ రెడ్డి

జేఎన్టీయూ రెక్టార్​గా విజయకుమార్ రెడ్డి

జేఎన్టీయూ, వెలుగు: కూకట్​పల్లిలోని జేఎన్టీయూ రెక్టార్​గా ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వర్సిటీ ఇన్​చార్జి రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్​గా విధులు నిర్వహిస్తున్న విజయకుమార్ రెడ్డి.. వర్సిటీ రెక్టార్​గా ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉంటారని రిజిస్ట్రార్ తెలిపారు.

ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్​గా పనిచేస్తున్న డాక్టర్ జీవీ నరసింహారెడ్డికి ప్రిన్సిపాల్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్​గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎ. అరుణకుమారిని జేఎన్టీయూహెచ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(డ్యూఎక్స్) డైరెక్టర్,  సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ తారా కళ్యాణిని డైరెక్టర్ ఆఫ్ అఫిలియేషన్స్ అండ్ అకడమిక్ ఆడిట్ ఇన్​చార్జి డైరెక్టర్​గా నియమించారు.