
- ఈ ఐదేండ్లలో మీరు చేసిందేమిటి?
- కేటీఆర్ కామెంట్లకు విజయశాంతి కౌంటర్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ వ్యవహారం తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదన్నట్లు ఉందని విజయశాంతి అన్నారు. తమతో కలవని వాళ్లను దేశద్రోహులుగా ముద్రవేస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్ కామెంట్లకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఐదేండ్లలో టీఆర్ఎస్ చేసిందేంటని నిలదీశారు. టీఆర్ఎస్తో కలిస్తే తెలంగాణవాదులు.. లేదంటే వ్యతిరేకులుగా ముద్ర వేయలేదా? అని ఫైర్ అయ్యారు. బీజేపీ పట్ల కేటీఆర్ కు కలిగిన అభిప్రాయమే.. టీఆర్ఎస్పై ప్రతిపక్షాలకు కలిగిందన్నారు. అదే అంతర్మథనంతో ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నా యన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ హైక మాండ్కు తత్వం బోధ పడినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనైనా టీఆర్ఎస్ నేతలు వైఖరి మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.