భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్’ సభ్యులను కలిశారు. గత ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఛానెల్ సభ్యులతో రాహుల్ భోజనం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
విలేజ్ కుకింగ్ ఛానెల్ ఓపెన్ ఫీల్డ్లలో సాంప్రదాయ పల్లెటూరి వంటకాలకు సంబంధించిన వీడియోలకు ప్రసిద్ధి. తమిళనాడు నుండి కోటి (10 మిలియన్లు) సబ్స్క్రైబర్ మార్క్ను చేరుకున్న మొదటి యూట్యూబ్ ఛానెల్ ఇది. తమ ప్రాంతం మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుండడంతో వారు ఆయన వద్దకు వెళ్లి కలిసారు. వారితో రాహుల్ అప్యాయంగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్ చేసింది.
हम तो भारत जोड़ के रहेंगे… लगा लो जितनी ताक़त हो ??#BharatJodoYatra pic.twitter.com/NWwy02jg73
— Congress (@INCIndia) September 9, 2022
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 3,500 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర పాదయాత్రను కొనసాగనుంది.