
అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు లీడ్గా కృష్ణ పోలూరు రూపొందించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’. కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు మంచి ఆదరణ దక్కుతోందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా శనివారం ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్.. ఈ సిరీస్ను ఆదరిస్తున్న ఆడియెన్స్కు థ్యాంక్స్ చెప్పారు.
ఇటీవల ఈ సిరీస్ కాపీ అంటూ వచ్చిన విమర్శలపై జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ స్పందిస్తూ ‘ప్రతీది ఒరిజినల్ కంటెంట్తోనే వచ్చాం. ఓటీటీల్లో ఎన్నో పోలీస్ స్టోరీలున్నాయి. మేం సొంతంగా రెడీ చేసుకున్న కథ ఇది. వివాదం కోర్టులో ఉంది కనుక మేము ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్కు ఇంతటి రెస్పాన్స్ రావడం హ్యాపీ.
మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘విరాటపాలెం’ విజయమే ఈ సిరీస్పై వస్తోన్న వివాదాలకు సమాధానం చెబుతుందని నిర్మాత కేవీ శ్రీరామ్ చెప్పారు.