గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్లోని ఓ బిజినెన్మెన్ ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్కొడుకు అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో కేసు వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్గ్రామానికి చెందిన సాకలి శంకర్ కొడుకు శివకుమార్(19) ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ మాదాపూర్కావూరి హిల్స్ఫేజ్–2లో ఉండే బిజినెస్మెన్బొడుగం వాసుదేవరెడ్డి ఇంట్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. యువకుడి తీరు నచ్చకపోవడంతో ఇంటి యజమాని 20 రోజుల కింద శివకుమార్ను పనిలో నుంచి తీసేశాడు. కాగా అక్కడ పనిచేసే టైంలోనే శివకుమార్ఇంటి తాళాలను డ్యూప్లికేట్ చేసి పెట్టుకున్నాడు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 6.30కు వాసుదేవరెడ్డి కుటుంబంతో కలిసి అజీజ్నగర్లోని ఫ్రెండ్ ఫాంహౌజ్ వెళ్లగా, వాచ్మెన్శంకర్పని మీద బయటికి వెళ్లాడు. ఇంట్లో రెనోవేషన్పనులు చేస్తున్న సిబ్బంది, కారు డ్రైవర్ ద్వారా వాసుదేవరెడ్డి ఇంట్లో లేడని తెలుసుకున్న శివకుమార్కాంపౌండ్వాల్దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. డ్యూప్లికేట్కీస్తో డోర్లు ఓపెన్చేస్తూ 3, 4 ఫ్లోర్లలోకి వెళ్లాడు. ఓ బెడ్రూంలోని కప్బోర్డును స్క్రూడ్రైవర్తో ఓపెన్చేసి అందులోని గోల్డ్, క్యాష్ సర్దుకుని10 నిమిషాల్లో పరారయ్యాడు. రాత్రి10.30కు తిరిగొచ్చిన వాసుదేవరెడ్డి బెడ్రూం డోర్ఓపెన్చేసి ఉండడం గమనించాడు. లోనికి వెళ్లి చూడగా కప్బోర్డు పగలగొట్టి ఉండడం, అందులో దాచిన క్యాష్, యూఎస్డాలర్లు, బంగారం కనిపించకపోవడంతో వెంటనే మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు ఫైల్చేసిన పోలీసులు హౌజ్ రెనోవేషన్పనులు చేస్తున్న కూలీలు, వాచ్మెన్ ను విచారించారు. అనంతరం సీసీ ఫుటేజీ పరిశీలించగా ఇంట్లోకి చొరబడి చోరీ చేసింది వాచ్మెన్కొడుకు శివకుమార్గా గుర్తించారు. 25వ తేదీ మధ్యాహ్నం షాద్నగర్ పరిధిలోని చటాన్పల్లి వద్ద శివకుమార్ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.24,63,250 క్యాష్, 14 తులాల గోల్డ్, 8,134 యూఎస్ డాలర్స్, రాయల్ఎన్ఫీల్డ్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ 2021లో కావూరి హిల్స్లోని హాషా హోమ్స్లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. దానికి కలర్మార్చి తిరుగుతున్నట్లు తెలిసింది. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్, ఇన్స్పెక్టర్రవీంద్రప్రసాద్, ఎస్సై రాజేందర్, సుఖేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.