ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించాం : మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించాం : మంత్రి  శ్రీధర్ బాబు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ కోసం హైదరాబాద్ లో 200 ఎకరాలు కేటాయించామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్‌ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్‌లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఇవాళ సైబర్‌ టవర్స్‌లో పీఎస్‌ఆర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ టెక్‌ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. 

సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని మొదటి స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నామని చెప్పారు.  జులైలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామన్నారు.  ఈ రంగంలో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ఐటీ సంస్థలు సహకరించాలన్నారు.

ALSO READ :- స్పెషల్ ఫ్లైట్ ఎవరిది?..ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్