సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం : వెంకటరమణా రెడ్డి

సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం : వెంకటరమణా రెడ్డి

తన గెలుపునకు కారణం కార్యకర్తలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్రంలోఎన్నికల గుర్తొస్తే కామారెడ్డి నే గుర్తు చేసుకుంటారని చెప్పారు. కామారెడ్డిలో గెలుపును  చూసి 45 నియోజక వర్గల్లో కార్యకర్తలు ఎలా గెలిపించుకోవాలో నేర్చుకుంటున్నారని అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించన కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జహిరా బాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ  బీబీ పాటిల్ ను 3వ సారి గెలిపించుకుంటమని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కామారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని బీజేపీ పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అవి అమలు కావాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. తనను  గెలిపిస్తే జహిరాబాద్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానని వెంకటరమణా రెడ్డి చెప్పారు.